కోల్కతా: ఉత్తరప్రదేశ్లో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు నదిలో కొట్టుకొచ్చి పశ్చిమ బెంగాల్కు చేరుతున్నాయని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నదిలో తేలుతున్న అనేక మృతదేహాలను గుర్తించామన్నారు. నది నీరు కలుషితమవుతున్నదని మమత తెలిపారు. ఈ నేపథ్యంలో నది నుండి మృతదేహాలను బయటకు తీసి చివరి కర్మలు నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు.