అభినందించిన కేసీఆర్
ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచన
తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 2: జాతీయ స్థాయి సశక్తికరణ్ అవార్డుకు ఎంపికైన మండలంలోని పర్లపల్లి పంచాయతీ పాలకవర్గ సభ్యులు సీఎం కేసీఆర్ను హైదరాబాద్లోని ప్రగతి భవన్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అవార్డు వచ్చిన సందర్భంగా సర్పంచ్ మాదాడి భారతీనర్సింహారెడ్డి, పాలకవర్గాన్ని సీఎం అభినందించారు. గ్రామంలో చేసిన అభివృద్ధి తీరుతెన్నులను టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి మాదాడి రమేశ్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. డీపీవో వీరబుచ్చయ్య, ఎంపీవో కిరణ్కుమార్, ఎంపీటీసీ సంపత్రెడ్డి, ఉపసర్పంచ్ రాజేశ్ తదితరులు ఉన్నారు.