బెంగళూరు, సెప్టెంబర్ 23: బెంగళూరు నగరంలో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించి ముగ్గురు దుర్మరణం చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ‘తారగుపేటలో పంక్చర్ షాప్ పక్కన ఉన్న ట్రాన్స్పోర్టు గోడౌన్లో పేలుడు సంభవించింది. పంక్చర్షాపులో ఇద్దరుసహా మొత్తం ముగ్గురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు’ అని బెంగళూరు దక్షిణ డిప్యూటీ పోలీస్ కమిషనర్ హరీశ్పాండే తెలిపారు. పరిశ్రమ సరుకు అయిన హానికర రసాయనం కారణంగా పేలుడు సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించారు. గోడౌన్లో ఇంకా హానికరమైన పేలుడు బాక్సులు 60 నిల్వ ఉన్నాయని, సిబ్బందిని, యాజమానిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. పేలుడు శబ్ధం రెండు కిలోమీటర్ల మేర వినిపించిందని స్థానిక ప్రజలు పేర్కొన్నారు.