బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిద్రమయ్యాయి. చుట్టుపక్కన భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. గాయపడ్డ వారిని స్థానిక విక్టోరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సిటీలోని చామరాజపేటలో ఓ భవనంలో ఈ ప్రమాదం జరగినట్లు సమాచారం. పేలుడుకు కారణాలేంటో తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
పేలుడు దాటికి మృతదేహాలు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డాయని స్థానికులు తెలిపారు. సమీపంలో ఉన్న వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. వెస్ట్జోన్ కమిషనర్ సంజీవ్ పటేల్ ఇచ్చిన సమాచారం ప్రకారం… ఓ గోడౌన్ నుంచి బాణసంచాను తరలిస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తున్నది.