కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్కు ఒకరోజు ముందు బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. బంకురా జిల్లాలోని జాయ్పుర్ ప్రాంతంలో శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. పేలుళ్లలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. పేలుళ్లపై తృణమూల్ నేతలు స్పందిస్తూ ఇది కాంగ్రెస్-వామపక్ష కూటమి పనేనని ఆరోపించారు. మరోవైపు పార్టీ కార్యాలయంలో తృణమూల్ కార్యకర్తలు బాంబులు తయారుచేస్తుండగా పేలుళ్లు జరిగాయని బీజేపీ పేర్కొంది.
తొలి దశ పోలింగ్ జరిగే 38 అసెంబ్లీ స్ధానాల్లో జాయ్పుర ఒకటి కావడం గమనార్హం. బాంబు పేలుడుతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తృణమూల్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలను రప్పించారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంకర్ కోరారు.