ముంబై, మే 10: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. తమ కస్టమర్లకు ఓ సదవకాశాన్నిచ్చింది. సేవింగ్స్ ఖాతాదారులు తమ శాఖను మార్చుకోవాలనుకుంటే ఇకపై బ్యాంక్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చునే ఆన్లైన్లో ఈ పని చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఎస్బీఐ ఈ మేరకు స్పష్టం చేసింది. యోనో ఎస్బీఐ, యోనో లైట్, ఆన్లైన్ ఎస్బీఐ వినియోగం ద్వారా ఖాతాను సులభంగా అందుబాటులోని మరో ఎస్బీఐ శాఖకు బదిలీ చేసుకోవచ్చని బ్యాంక్ ట్వీట్ చేసింది.
ఏం చేయాలంటే?