గౌహతి : అస్సాం మంత్రి, బీజేపీ నేత హిమంత శర్మపై ఎన్నికల సంఘం 48 గంటల నిషేధం విధించింది. రెండు రోజుల పాటు ఎటువంటి ప్రచారంలో పాల్గొనరాదు అని ఈసీ తన ఆదేశాల్లో పేర్కొన్నది. బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ చీఫ్ హగ్రామా మొహిలారాను బెదిరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు హిమంతపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ కేసులో ఇవాళ బీజేపీ నేత హిమంత గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. మరికొన్ని గంటల్లో దీనిపై కోర్టు తీర్పును వెలువరించే అవకాశాలు ఉన్నాయి. గత రాత్రి నుంచే శర్మపై బ్యాన్ అమలులోకి వచ్చింది. హిమంత.. అస్సాంలో బీజేపీకి ప్రధాన వ్యూహకర్త. స్టార్ క్యాంపేనర్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈసీ తాజా ఆదేశాలతో హిమంత చిక్కుల్లో పడ్డారు.