బండ్లగూడ, జూలై 9 : ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. శుక్రవారం శివరాంపల్లిలో ఎమ్మెల్యే అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణను పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఆరేండ్లుగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కోట్లాది మొక్కలను నాటారన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉద్యమంలా హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటాలన్నారు. ఖాళీ స్థలాలు, ఇండ్ల ఎదుట ఒక్కొక్కరు ఆరు మొక్కలను నాటేందుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఉపకమిషనర్ జగన్, ఎంఈఓ రాంరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ధర్మారెడ్డి, మహేశ్, శ్రీధర్రెడ్డి, శ్రవణ్ పాల్గొన్నారు.
బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొ క్కలు నాటేందుకు ముందుకు రావాలని మేయర్ మహేందర్గౌడ్ అన్నారు. ఆయన కార్పొరేషన్ పరిధిలోని నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. మేయర్ అధికారులతో చర్చించి ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేయడంతో పాటు వాటిని నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈ రాజీవ్రెడ్డి పాల్గొన్నారు
గందంగూడలో కార్పొరేటర్ పద్మావతి పాండు, ప్రత్యేక అధికారి మనోహర్తో కలిసి ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. చిన్నపిల్లలు, వృద్ధులను ఎలా సంరక్షించుకుంటామో అదేవిధంగా మొక్కలను సంరక్షించాలని ప్రజలకు సూచించారు.