ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వారంలో చివరి రోజు ట్రేడింగ్ను మార్కెట్లు నష్టాలతో ముగించాయి. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలతోనే మొదలైన మార్కెట్లు ఆ తర్వాత కొద్దిసేపు లాభాల్లోకి వచ్చాయి. ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లి రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. ఉదయం 49,743 వద్ద రోజును ప్రారంభించిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 154 పాయింట్లు కోల్పోయింది.
ఒక దశలో 49,906 వద్ద రోజులో గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. చివరకు 49,591 వద్ద రోజును ముగించింది. ఇక, 14,882 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 14,834 వద్ద రోజును ముగించింది. సిప్లా, సన్ ఫార్మా, హెచ్యూఎల్, టెక్ మహీంద్రా లాభాలను ఆర్జించగా.. బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, ఎన్టీపీసీ, అల్ట్రా టెక్ సిమెంట్ నష్టాలను చవిచూశాయి.