మున్సిపల్ భవనంపై ‘జై శ్రీరామ్’ జెండా ఎగురేసిన బీజేపీ

తిరువనంతపురం: కేరళలోని పాలక్కాడ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వరుసగా రెండోసారి గెలిచింది. ఈ నెల 16న ఫలితాలు వెలువడగా సంబరాలు జరుపుతున్నది. కాగా కొందరు బీజేపీ కార్యకర్తలు గురువారం స్థానిక మున్సిపల్ భవనంపై ‘జై శ్రీరామ్’ పేరుతో భారీ జెండాను ఎగురేశారు. మరాఠా యోధుడు శివాజీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోస్టర్లు కూడా వేలాడ దీశారు. పాలక్కాడ్ నగరాన్ని కేరళలోని గుజరాత్గా బీజేపీ అధికార ప్రతినిధి సందీప్ వేరియర్ తన ఫేస్బుక్ పోస్ట్లో అభివర్ణించారు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు బీజేపీ కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు దీనికి బదులుగా వామపక్ష నేతలు శుక్రవారం పాలక్కాడ్ మున్సిపల్ భవనంపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా, లౌకికవాదానికి మద్దతుగా నినాదాలు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- ముష్కరుల దాడి.. నలుగురు జవాన్లకు గాయాలు
- ఐపీఎల్-2021 మినీ వేలం తేదీ, వేదిక ఖరారు
- థాంక్యూ ఇండియా : నేపాల్ ప్రధాని ఓలీ
- ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లు దాటిన కోవిడ్ కేసులు
- నదిలో పడవ మునిగి నలుగురు మృతి
- యూకే వైరస్పై సమర్థంగా పని చేస్తున్న కొవాగ్జిన్
- యాపిల్ ఐఫోన్ : భారత్లో బంపర్ సేల్స్
- ఉనికి కోసమే ఉత్తమ్ పాకులాట : ఎమ్మెల్యే శానంపూడి
- 2022 చివర వరకు భారత్, చైనాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ..
- కొవిడ్తో కోట్ల ఉద్యోగాలపై ప్రభావం: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక