అమరావతి : ఏపీలో కరోనా రోజురోజుకి విస్తరిస్తుంది. కొత్తగా 6,582 కరోనా కేసులు నమోదవ్వగా కొవిడ్-19తో తాజాగా 22 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతిచెందగా.. కృష్ణా, నెల్లూరులో నలుగురు చొప్పున, కర్నూలులో ముగ్గురు, అనంతపురం, గుంటూరులో ఇద్దరు చొప్పున, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు.
గత 24 గంటల్లో చిత్తూరులో అత్యధికంగా 1,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా శ్రీకాకుళం-912, గుంటూరు-804, కర్నూలు-729, నెల్లూరు-597, విశాఖపట్నం-551, కృష్ణా-465, విజయనగరం-349, అనంతపురం-305, కడప-203, తూర్పుగోదావరి-100, ప్రకాశం జిల్లాలో 314 కరోనా కేసులు నమోదయ్యాయి.