హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 800 మంది శిల్పు లు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.1000 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో రూ. 200 కోట్ల చిన్నచిన్న పనులే మిగిలి ఉన్నాయి. నవంబర్ ఆఖరు నాటికి మొత్తం పనులన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో శిల్పులు, అధికారులు, సిబ్బంది కృషిచేస్తున్నారు. ఇదే సమయంలో 850 ఎకరాల్లో టెంపుల్ సిటీని నిర్మించాలని తలపెట్టారు. మొదటి దశలో 252 కాటేజీలు నిర్మించనున్నారు. ఈ కాటేజీలను దాతలు నిర్మించాలా? లేక నేరుగా ప్రభుత్వమే నిర్మించాలా? అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.