పారిస్: కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ వారం ఆలస్యంగా ప్రారంభం కానుంది. మే 23న మొదలవ్వాల్సిన మెయిన్ డ్రా 30 నుంచి జరుగుతుందని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య గురువారం వెల్లడించింది. ఫ్రాన్స్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో పాటు దేశవ్యాప్తంగా ఆంక్షలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.