ఖమ్మం : ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ను పురస్కరించుకొని ముస్లిం సోదర, సోదరీమణులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నివాసంలో కొద్దిమంది ముస్లిం పెద్దలతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వారితో పాటు మంత్రి నమాజ్ చేశారు. నెల రోజుల పాటు అత్యంత నియమనిష్ఠలతో ఉపవాస దీక్షలు చేస్తూ ప్రపంచ బాగు కోసం అల్లాను ప్రార్థించిన ప్రతి ముస్లిం సోదర, సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు.
మైనారిటీలు ఆత్మగౌరవంతో తల ఎత్తుకునేలా సీఎం కేసీఆర్ బాటలు వేశారన్నారు. పర్వదిన సంబురాలను ముస్లిం సోదరులు కరోనా నిబంధనల ప్రకారంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్లు
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి సత్యవతి రాథోడ్
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత
అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనుల పరిశీలన