న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో అవకతవకలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీపై బీజేపీ విమర్శలు గుప్పించింఇ. అవాస్తవాలు, అభూత కల్పనలకు మారుపేరైన కాంగ్రెస్ మరోసారి రఫేల్ ఒప్పందంపై అసత్యాలు ప్రచారం చేస్తోందని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్రా ఆరోపించారు. ఫ్రాన్స్లో రఫేల్ ఒప్పందంపై ఓ ఎన్జీవో చేసిన ఫిర్యాదుపై అక్కడి ఫైనాన్షియల్ ప్రాసిక్యూషన్ దర్యాప్తునకు ఆదేశిస్తే దాన్ని అవినీతిగా చూడటం సరైంది కాదని అన్నారు.
రాహుల్ గాంధీ చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఆయన ఈ డీల్లో పోటీపడిన కంపెనీల ఏజెంట్గా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంపై తొలి నుంచీ రాహుల్ అసత్యాలు మాట్లాడుతున్నారని బీజేపీ ప్రతినిధి ఆరోపించారు. రఫేల్ ఒప్పందంలో గాంధీ కుటుంబానికి కమీషన్లు ముట్టకపోవడంతోనే ఆ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని అన్నారు. పంజాబ్, రాజస్ధాన్, చత్తీస్ఘఢ్లో తమ ప్రభుత్వాల్లో రాజకీయ అభద్రత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ రఫేల్ ఒప్పందాన్ని ముందుకు తెస్తోందని దుయ్యబట్టారు.