ముంబై: గేయ రచయిత, సినిమా కథ రచయిత జావెద్ అక్తర్, ఆయన కుటుంబాలు కష్టాల్లో చిక్కుకున్నది. జావెద్ అక్తర్ సినిమాలను ప్రదర్శించేందుకు అనుమతించబోమని బీజేపీ స్పష్టం చేసింది. ఆఫ్ఘన్లోని తాలిబన్లతో ఆరెస్సెస్, వీహెచ్పీలను జావెద్ అక్తర్ పోల్చడంపై మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాం కదమ్ మండి పడ్డారు.
తన వ్యాఖ్యలపై జావెద్ అక్తర్ క్షమాపణ చెప్పే వరకు దేశంలోని సినిమా థియేటర్లలో ఆయన సినిమాలను ప్రదర్శించబోమని శనివారం పేర్కొన్నారు. తాలిబన్ల అనాగరిక చర్యలు ఖండించాలని జావెద్ అక్తర్ ఓ వెబ్సైట్తో మాట్లాడుతూ అన్నారు. ఆరెస్సెస్, వీహెచ్పీ, భజరంగ్దళ్లను సమర్థింస్తున్న వారు చేస్తున్నది అదేనన్నారు.