ఢిల్లీ : బిట్శాట్ 2021 ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్) పిలానీ ఈ నిర్ణయం వెలువరించింది. పరీక్ష జూన్ 24 నుండి 29వ తేదీ మధ్యలో జరగాల్సి ఉండే. కాగా తాజా నిర్ణయంతో జూలై, ఆగస్టులో జరగనుంది. పరీక్షల తేదీలను జూన్లో వెబ్సైట్ ద్వారా ప్రకటించనున్నట్లు తెలిపింది.
ఈ క్రమంలో దరఖాస్తు గడువు తేదీని పొడిగించింది. విద్యార్థులు తమ దరఖాస్తులను జూన్ 30 సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్సైట్ bitsadmission.com ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తు రుసుం పురుష అభ్యర్థులకు రూ.3,400, మహిళా అభ్యర్థులకు రూ.2,900గా ఉంది. అదే దుబాయ్లో పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులకు దరఖాస్తు రుసుము రూ. 7 వేలు. బిట్స్, పిలాని, గోవా, హైదరాబాద్లోని క్యాంపస్లలో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్లలో ప్రవేశం కోసం బిట్షాట్ జరుగుతుంది.