చెన్నై, సెప్టెంబర్ 13: నీట్కు బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును తమిళనాడు అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. సీఎం స్టాలిన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సహా అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాయి. ఒక్క బీజేపీ మాత్రమే వాకౌట్ చేసింది. ఆదివారం సేలంలో నీట్ విద్యార్థి ధనుష్ ఆత్మహత్య చేసుకొన్నాడు. దీనిపై సోమవారం అసెంబ్లీలో ప్రతిపక్షాలు నిలదీశా యి. రాష్ట్రంలో నీట్ను రద్దు చేస్తామన్న హామీ ని డీఎంకే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశా యి. ఈ నేపథ్యంలోనే బిల్లు ఆమోదం పొం దడం గమనార్హం. విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించి, సామాజిక న్యాయం చేకూర్చేందుకే బిల్లును తీసుకు వచ్చినట్టు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ బడుల్లో చదివిన వారికి 7.5% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రతిపాదించింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపితే చట్టంగా మారుతుంది. తర్వాత నీట్తో సంబంధం లేకుండా రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు ఉంటాయి.
గతంలో ఈ విధానమే అమలు
తమిళనాడులో గతంలో కూడా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు 12వ తరగతి మార్కులనే ప్రామాణికంగా తీసుకొనేవారు. 2017 వరకు ఇదే విధానం అమల్లో ఉంది. పళనిస్వామి సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో నీట్ను నిర్వహిస్తున్నారు. అప్పుడు కూడా పళని ప్రభుత్వం తమ రాష్ట్రంలో నీట్ రద్దు కోరుతూ బిల్లును ఆమోదించింది. కానీ దానికి రాష్ట్రపతి ఆమోదం లభించలేదు. దీనిపై కోర్టుకు వెళ్లగా సుప్రీంకోర్టు కూడా నీట్కు అనుకూలంగానే తీర్పునిచ్చింది.
తమిళం దైవ భాష
మద్రాస్ హైకోర్టు వ్యాఖ్య
చెన్నై, సెప్టెంబర్ 13: తమిళం ‘దైవ భాష’ అని మద్రాస్ హైకోర్టు ఇటీవల ఓ తీర్పులో వ్యాఖ్యానించింది. సంస్కృ తం ఒక్కటే దైవ భాష అని ఇన్నాళ్లు నమ్మించారని పేర్కొన్నది. దేశవ్యాప్తం గా ఆలయాల్లో తమిళ మంత్రాలను పఠించాలని, ఇందుకోసం ఆళ్వార్లు, నయనార్లు తదితరులు తమిళ మంత్రాలను రూపొందించాలని కోరింది. తమిళనాడులోని ఓ ఆలయంలో తమిళంలో మంత్రాలు పఠించేలా అధికారులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ కిరుబాకరన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. తమిళ భాష శివతాండవం సమయంలో ఆయన ఢమరుకం నుంచి వెలువడిందన్న నమ్మకం ప్రజల్లో ఉందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
మెడికల్ కోర్సుల్లో కొరవడ్డ సామాజిక వైవిధ్యం
నీట్ ద్వారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలపై అధ్యయనం కోసం తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఏకే రాజన్ నేతృత్వంలో గతంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఎంబీబీఎస్, ఇతర ఉన్న మెడికల్కోర్సుల్లో నీట్ వల్ల సామాజిక వైవిధ్యం కొరవడిందని, కొన్ని వర్గాల వాళ్లకే ప్రాతినిధ్యం లభిస్తున్నదని కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. ధనిక వర్గాలు, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులకే కోచింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండటం వల్ల మెరుగైన ర్యాంకులు సాధిస్తున్నారని, పేద విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపింది. నీట్కు బదులుగా వేరే మార్గాల ద్వారా ప్రవేశాలు కల్పించేలా కొత్త చట్టం తీసుకురావాలని సూచించింది.