రాయ్పూర్ : దేశంలో వంద కోట్ల టీకాల పంపిణీ పూర్తి సందర్భంగా ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ రైల్వే స్టేషన్లో ప్రకటన చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇవాళ్టి వరకు ఇండియా 100 కోట్ల టీకాల పంపిణీని పూర్తి చేసి, అసాధారణ మైలురాయిని అందుకున్నదని ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా టీకాల పంపిణీ ప్రక్రియలో భాగమైన వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.