పాట్నా : క్షుద్రవిద్యలు తెలిసిన మాంత్రికుడు ఒకడు కలలో తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని బీహార్లోని ఔరంగాబాద్కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడు అనారోగ్యంపాలైతే, గత జనవరిలో మాం త్రికుడు ప్రశాంత్ చతుర్వేదిని కలిశానని, అతను ఇచ్చిన తాయత్తును తన కొడుక్కి కట్టినప్పటికీ, 15 రోజుల తర్వాత తన కుమారుడు మరణించాడని ఆమె తెలిపారు. ఎందుకు ఇలా జరిగిందని మాంత్రికుడిని ప్రశ్నిస్తే, తనపై కలలో లైంగికదాడికి పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు.