పాట్నా: బీహార్ అసెంబ్లీ జేడీయూ, బీజేపీ కార్యాలయంగా మారిందని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ విమర్శించారు. తమ పార్టీ అభిప్రాయాలను సభలో వెల్లడించేందుకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు. ఇది నియంతృత్వ విధానమని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలతో కలిసి శనివారం బడ్జెట్ సమావేశాల నుంచి తేజశ్వి యాదవ్ వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ నుంచి రాజ్భవన్ వరకు కాలినడకన వెళ్లి నిరసన తెలిపారు. ప్రభుత్వం నియంతగా వ్యవహరిస్తున్నది, విధాన సభలో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వడం లేదని తేజశ్వి యాదవ్ విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.