న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ ప్రజలందరి ప్రాణాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సెకండ్ వేవ్లో తక్కువ కాలంలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మొదటి వేవ్లో 730 మంది డాక్టర్లు మృతి చెందగా, సెకండ్ వేవ్లో ఇప్పటి వరకు 244 మంది వైద్యులు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) వెల్లడించింది.
సెకండ్ వేవ్లో బీహార్లో 69 మంది డాక్టర్లు మరణించగా, ఉత్తరప్రదేశ్లో 34 మంది, ఢిల్లీలో 27 మంది, ఏపీలో 21, అసోంలో 2, ఛత్తీస్గఢ్లో 3, గుజరాత్లో 2, గోవాలో ఒకరు, హర్యానాలో 2, జమ్మూకశ్మీర్ 3, కర్ణాటక 8, కేరళ 2, మధ్యప్రదేశ్ 5, మహారాష్ర్ట 13, ఒడిశా 8, తమిళనాడు 10, తెలంగాణ 19 మంది డాక్టర్లు చనిపోయారు.
ఇటీవల ఢిల్లీకి చెందిన యంగెస్ట్ ఫిజిషీయన్ డాక్టర్ అనాస్ మిజాహిద్(25) కరోనాతో కన్నుమూశారు. కోల్కతాకు చెందిన డాక్టర్ అనిల్ కుమార్ రక్షిత్(87) కూడా ప్రాణాలు కోల్పోయారు.