పాట్నా : బిహార్ రాజధాని పాట్నాలోని రెండు ప్రధాన దవాఖానలైనా ఎయిమ్స్, పాట్నా మెడికల్ కళాశాల – హాస్పిటల్లో 500 మందికిపైగా వైద్యులు, సిబ్బంది వైరస్కు పాజిటివ్గా పరీక్షించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఎయిమ్స్లో 384 మంది ఉద్యోగులు, వైద్యులు, నర్సులు, సఫాయి కర్మాచారిలు వైరస్ బారినపడ్డారని మెడికల్ సూపరింటెండెంట్ సీఎం సింగ్ తెలిపారు. పీఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇందూశేఖర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 125 మంది సిబ్బందిపైగా పాజిటివ్ పరీక్షలు చేశారన్నారు.
ఇందులో 70 మంది వైద్యులు, 55 మందిపైగా నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారన్నారు. ఎయిమ్స్తో పాటు పీఎంసీహెచ్తో పాటు నలంద మెడికల్ కళాశాల, హాస్పిటల్ పెద్ద సంఖ్యలో రోగులకు సేవలందిస్తున్నాయి. పీఎంసీహెచ్లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ వసతి కల్పించినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. 105 పడకలున్నాయి. ఎయిమ్స్లో 250 బెడ్లకు విస్తరించారు. వైరస్ రెండో దశ వ్యాప్తి చెందడంతో ప్రస్తుతం అన్ని పడకలు నిండాయి. పీఎంసీహెచ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో సిబ్బంది వైరస్ బారినపడడంతో సిబ్బంది కొరత ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
అన్ని సెలవులు రద్దు చేశామని, కొవిడ్ వార్డులను నిర్వహిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా.. బిహార్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిరుపేదల సహాయం కోసం రాష్ట్రవ్యాప్తంగా 40 మంది వైద్యుల ఫోన్ నంబర్ల జాబితాను విడుదల చేసింది. ఇంటి వద్దనే ఉన్న రోగులకు ఫోన్ ద్వారా చికిత్స అందిస్తారని ఐఎంఏ అధ్యక్షుడు షాజానంద్ సింగ్ పేర్కొన్నారు. బిహార్లో నిన్న 12,222 మంది కరోనా మహమ్మారి బారినపడగా.. 56 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్లో ప్రస్తుతం 63,745 యాక్టివ్ కేసులున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.