పాట్నా: బీహార్లో రహదారుల పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లోని శ్మశాన వాటికలు వరద నీటిలో మునిగిపోవడమే దీనికి కారణం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ఇంకా వరద నీటిలో చిక్కుకునే ఉన్నాయి. మరోవైపు గంగా నదిలో నీటి మట్టం బాగా పెరిగింది. దీంతో బీహార్ రాజధాని పాట్నాతో సహ పలు నగరాల్లోని ప్రాంతాలను వరద ముంచెత్తింది. శ్మశాన వాటికలు కూడా వరద నీటితో మునిగాయి. ఈ నేపథ్యంలో పాట్నా ప్రజలు ప్రధాన రహదారుల పక్కనే మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. దహన వాటికలు నీట మునగడంతో మృతదేహాలకు రోడ్లపైనే దహన సంస్కారాలు చేయాల్సి వస్తున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.