కలెక్టర్ రవి
యాసంగి ధాన్యం సేకరణపై అధికారులతో సమీక్షా సమావేశం
జగిత్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 1: యాసంగి సీజన్లో ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను చేపట్టాలని, ఇందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ జీ రవి తెలిపారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్, సంబంధిత అధికారులతో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యాసంగి సీజన్లో 6.50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనాలకు అనుగుణంగా ఏప్రిల్ రెండో వారం నుంచి జిల్లా వ్యాప్తంగా 406 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, గన్నీ బ్యాగులు, తేమ పరీక్షించే యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాంటాల వంటివాటికి మరమ్మతులు చేయించి అందుబాటులో ఉంచాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు, చల్లని మంచినీరు, టెంట్, షెడ్డు ఏర్పాటు చేయాలని, కొవిడ్ నిబంధనల మేరకు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడానికి నీరు, టాయిలెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ప్రతి సెంటర్లో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, గతంలో జరిగిన పొరపాట్లు, ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని, రైస్ మిల్లుల్లో స్టోరేజీ సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ బేతి రాజేశం, డీఆర్డీఏ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయాధికారి సురేశ్, సివిల్ సప్లాయీస్ జిల్లా మేనేజర్ రజినీకాంత్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, జిల్లా సివిల్ సప్లాయీస్ అధికారి చందన్కుమార్, జిల్లా సహకారాధికారి రామానుజాచార్యులు, జిల్లా తూనికలు, కొలత అధికారి పాల్గొన్నారు.
ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలి
జగిత్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 1: రెవెన్యూ అధికారులు జారీ చేసే ప్రతి ధ్రువీకరణ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ రవి అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మీ సేవా, రేషన్ దుకాణాల తనిఖీ, ధరణి, ఇసుక, మట్టి అక్రమ రవాణా, భూముల అన్యాక్రాంతంపై వంటి అంశాలపై కలెక్టర్ జూమ్ యాప్ ద్వారా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బేతి రాజేశం, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మాధురి, వినోద్కుమార్, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
ఎముకలు బలంగా కావాలా? ఇవి తినండి
అల్లం టీతో ఆస్తమాకు గుడ్బై.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు