చెన్నారావుపేట/రాయపర్తి/దుగ్గొండి, ఏప్రిల్ 27: మండలకేంద్రంలో ముదురుకోళ్ల ఉపేంద్ర మరణించగా, ఆమె కుటుంబానికి టీఆర్ఎస్ యువనేత కంది కృష్ణచైతన్యరెడ్డి మంగళవారం 50 కేజీల బియ్యం, వంట నూనె, సరుకులు అందజేశారు. కార్యక్రమంలో జాగృతి మండలాధ్యక్షుడు మూడు రమేశ్నాయక్, అడుప రమేశ్, ఉప్పునూతుల రాజు, ఉప్పుల రవి, ననుమాస సాయి, వీ విక్రమ్, రవి పాల్గొన్నారు. రాయపర్తి మండలం తిర్మలాయపల్లిలో కరోనా పాజిటివ్ వ్యక్తులకు టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా సర్పంచ్ గజవెల్లి అనంతప్రసాద్ నిత్యావసరాలు అందజేశారు. ఉప సర్పంచ్ గుడి యుగేంధర్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ డీ యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు, వీ కుమారస్వామి, యాకయ్య పాల్గొన్నారు. దుగ్గొండిలోని ఎస్సీకాలనీలో పాజిటివ్ వచ్చిన వారికి జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ సహకారంతో రూ. 20 వేల ఆర్థిక సాయంతోపాటు నిత్యావసరాలు అందించినట్లు టీఆర్ఎస్ యువజన నాయకుడు పర్లపల్లి ప్రతాప్ తెలిపారు. వైద్యుడు చేరాలు, వార్డు సభ్యురాలు పర్లపల్లి సంధ్య, కమలాకర్, గణేశ్, కార్తీక్, యుగేంధర్, ఏఎన్ఎం భవాని, ఆశ కార్యకర్త సరళ పాల్గొన్నారు.
గుడ్లు, మాస్కుల పంపిణీ
సంగెం, ఏప్రిల్ 27: ఎల్గూర్రంగంపేటలో కరోనా వచ్చిన వారికి పంపిణీ చేసేందుకు దిక్చూచి స్వచ్ఛంద సంస్థ సభ్యులు సర్పంచ్ పోతుల ప్రభాకర్కు కోడిగుడ్లు, మాస్కులు అందజేశారు. బందెల మల్లేశం, ఎంపీటీసీ పద్మ, ఉపసర్పంచ్ కొమురయ్య పాల్గొన్నారు.