జనగామ : వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం అనే నినాదంతో 33 జిల్లాలు 15 రోజులు 2,400 కిలోమీటర్ల సైకిల్ యాత్రను సోమవారం జనగామ జిల్లా ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యుడు జిట్టబోయిన భరత్ చేపట్టాడు. ఈ సైకిల్ యాత్ర ను ఈ రోజు ఉదయం 6 గంటలకు జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వద్ద నర్మెట సర్కిల్ ఇన్స్పెక్టర్ యం. కరుణాకర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సైకిల్ యాత్ర నేటి నుంచి 10-5-2021 తేదీ వరకు తెలంగాణ లోని 33 జిల్లాల మీదుగా వెళ్తూ ప్రజల్లో ఆరోగ్యం పై అవగాహన కల్పించనుంది. అనంతరం హైదరాబాద్ లోని డాక్టర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (Additional DGP ) ఆఫీస్ TTWREIS నందు సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమం ఉంటుందని భరత్ తెలిపాడు.