హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ ) : కరోనా మనుషులపైనే కాదు.. పెంపుడు జంతువులపైనా ప్రతాపం చూపిస్తున్నదంటూ ఇటీవల వస్తున్న వార్తలతో పెట్స్ యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. జంతువులకూ కరోనా సోకుతుందని కొందరు నిపుణులు, అది ముమ్మాటికీ అసాధ్యమని మరికొందరు నిపుణులు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో..కరోనా పీడ వదిలిపోయేవరకు తమ పెట్స్ను ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో కొన్నాళ్ల పాటు ఉంచుదామన్న ఆందోళన కొంతమందిలో పెరిగింది. పెంపుడు జంతువుల కదలికలపై నగరంలో కొన్ని అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు కూడా ఆంక్షలు విధించడంతో యజమానులకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పెంపుడు జంతువులను సంరక్షించేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. వారానికి కొంత చొప్పున ఫీజు తీసుకుంటూ మూగజీవాలను సంరక్షిస్తున్నాయి. ఇలాంటి సంస్థల వివరాలు మీ కోసం..