ZEE Dispute | జీ ఎంటర్టైన్మెంట్లో అతిపెద్ద ఇన్వెస్టర్ ఇన్వెస్కోకు బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాటాదారులతో జీ అసాధారణ వార్షిక సమావేశం నిర్వహించాలన్న ఇన్వెస్కో డిమాండ్ను న్యాయస్థానం నిషేధించింది. చైనా సంస్థల మద్దతుతో ఇన్వెస్కో పని చేస్తున్నది. జీ ఎంటర్టైన్మెంట్లో ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ అతిపెద్ద ఇన్వెస్టర్లు. ఈ రెండు సంస్థలు జీ అసాధారణ ఏజీఎం నిర్వహించాలని, ఎండీ కం సీఈవో పునీత్ గోయెంకాను, డైరెక్టర్లు అశోక్ కురియన్, మనీష్ చొఖానీలను తొలగించాలని కోరుతూ గత నెల 11న కంపెనీకి నోటీసులు ఇచ్చాయి. అయితే, ఇన్వెస్కో ప్రతిపాదన నిష్ఫలమైందని పేర్కొంటూ ఇప్పటికే కురియన్, చొఖానీలు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు.
ఇంకా ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లుగా సురేంద్ర సింగ్ సిరోహి, నైనా కృష్ణమూర్తి, రోహన్ ధామిజా, అరుణా శర్మ, శ్రీనివాసరావు అడెపాటి, గౌరవ్ మెహతాలను నియమించాలని ఇన్వెస్కో డిమాండ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల రెండో తేదీన జీ ఎంటర్టైన్మెంట్.. బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఇన్వెస్కో నోటీసు చట్టవిరుద్ధం, నిరుపయోగం అని ప్రకటించాలని కోరింది.
దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు గతవారం తీర్పును రిజర్వు చేసింది. పునీత్ గోయెంకా తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ఒకవేళ పునీత్ గోయెంకాను తొలగిస్తే సంస్థ బోర్డు డైరెక్టర్లు, ఎండీ-సీఈవో లేకుండా పని చేయలేవని వాదించారు. జీ వ్యవస్థాపకుడు డాక్టర్ సుభాష్ చంద్ర కూడా.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్వెస్కో నిజమైన, యోగ్యమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
సూడాన్లో సైనిక తిరుగుబాటు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఏడుగురు మృతి
మీ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగించకండి: సోనియాగాంధీ
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
గాయాల గురించి చెప్పే స్మార్ట్ బ్యాండేజ్ వచ్చేసింది..!
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!