న్యూఢిల్లీ: ఫేస్బుక్, గూగుల్, ఇన్స్టాగ్రామ్పై కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇవాళ ప్రశంసలు కురిపించారు. దిగ్గజ సంస్థలు తమ ఫ్లాట్ఫామ్లో ఉన్న అనుచిత పోస్టులను తొలగించడాన్ని ఆయన స్వాగతించారు. కొత్త ఐటీ రూల్స్ను ఆ సంస్థలు అమలు చేయడం శుభపరిణామం అన్నారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇది పారదర్శకతకు భారీ ఊతంగా నిలుస్తుందని మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఫేస్బుక్ తన ఫ్లాట్ఫామ్ నుంచి సుమారు 30 మిలియన్ల పోస్టులను డిలీట్ చేసింది. ఫోటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ కూడా రెండు మిలియన్లు పోస్టులను డిలీట్ చేసింది. కొత్త ఐటీ రూల్స్కు లోబడి.. గూగుల్ కూడా 59,350 లింకులను తొలగించింది. దాంట్లో యూట్యూబ్ కూడా ఉంది. స్వదేశీయంగా డెవలప్ చేసిన సోషల్ మీడియా యాప్ ‘కూ’ కూడా 1253 పోస్టులను తొలగించింది. అయితే కేంద్ర మంత్రి రవిశంకర్ తన ట్వీట్లో ట్విట్టర్ సంస్థపై ఎటువంటి కామెంట్ చేయలేదు.