బెంగళూరులో ప్రైవేటు టీచర్లు, సిబ్బంది భారీ నిరసన ర్యాలీ

బెంగళూరు : ట్యూషన్ ఫీజును తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది నిరసిస్తూ భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఘటన కర్ణాటకలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు స్కూల్స్ ట్యూషన్ ఫీజును 70 శాతమే మాత్రమే వసూలు చేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు టీచర్లు, యజమాన్యాలు, సిబ్బంది రాష్ట్ర రాజధాని బెంగళూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
దాదాపు 3 వేల మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది రోడ్లపైకి వచ్చి నిరసనలో పాల్గొన్నారు. కర్ణాటక ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. బెంగళూరు ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి ప్రముఖ నిరసన ప్రదేశం ఫ్రీడమ్ పార్క్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ట్యూషన్ ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా టీచర్లకు గ్రాంట్లు విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 16,577 కొవిడ్ కేసులు
- బన్నీ సినిమాను రిజెక్ట్ చేసిన ప్రియా ప్రకాశ్.. !
- 100 జిలటిన్ స్టిక్స్.. 350 డిటోనేటర్లు స్వాధీనం
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ