అంబర్పేట, ఏప్రిల్ 17: కరోనా టెస్టులకోసం, వ్యాక్సినేషన్కు వచ్చి న వారిని విడివిడిగా ఉంచి పరీక్షలు, టీకాలు వేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించి అక్కడ జరుగుతున్న కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ వివరాలను తెలుసుకున్నారు. ఒక పక్క కొవిడ్ టెస్టులు చేస్తుండగా, మరోపక్క వ్యాక్సినేషన్ టీకాలు వేస్తుండటాన్ని గమనించారు. టెస్టుల కోసం వచ్చే వారిలో ఎవరికైనా పాజిటివ్ ఉంటే ఇతరులకు వచ్చే అవకాశం ఉందన్నారు. కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో టెస్టింగ్, వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారికి కలుసుకునే ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా. గీతారాణి, వైద్య సిబ్బంది, నాయకులు అనిల్కుమార్, కాలేరు భరత్, వర్మ తదితరులు పాల్గొన్నారు.