న్యూఢిల్లీ : ఛత్తీస్గఢ్లో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పందించారు. ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అధిష్టానం నన్ను సీఎంగా ప్రమాణస్వీకారం చేయమని సూచించింది. నేను సీఎంగా బాధ్య తలు చేపట్టాను. ఒకవేళ వాళ్లు వేరే వాళ్లను ముఖ్యమంత్రిగా నియమిస్తే అలాగే జరుగుతుంది’ అని అన్నారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు నాలుగింట మూడో వంతు మెజారిటీ ఉన్నదని బఘేల్ చెప్పారు.