గాంధీనగర్, సెప్టెంబర్ 13: గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ ఆయనతో ప్రమాణం చేయించారు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రెండు రోజుల కిందట విజయ్ రూపానీ సీఎం పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన స్థానంలో 2017లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపేంద్రకు సీఎం పీఠం దక్కింది. ప్రస్తుతం మంత్రులుగా ఎవరూ ప్రమాణం చేయలేదు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీఎంలు ఖట్టర్ (హర్యానా), శివరాజ్సింగ్(మధ్యప్రదేశ్), ప్రమోద్ సావంత్ (గోవా), బసవరాజ్ బొమ్మై (కర్ణాటక) హాజరయ్యారు.
నితిన్ పటేల్ కంటతడి
సీఎం సీటుపై గంపెడు ఆశలు పెట్టుకున్న గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ కంటతడి పెట్టారు. చెయ్యిదాకా వచ్చిన సీఎం కుర్చీ క్షణాల్లో అందకుండా పోవడంతో లోలోన కుమిలిపోయారు. బాధను దిగమింగుకుంటూ పార్టీ తనకు ఎంతో ఇచ్చిందన్నారు.