బోఫాల్: ఆరెస్సెస్ అనుబంధ సంస్థకు బోఫాల్లోని పారిశ్రామిక ప్రాంతంలోని 10 వేల చదరపు అడుగుల స్థలాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అప్పగించడం వివాదాస్పదమైంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నిరసనకు దిగారు.
గోవింద్పురా ఇండస్ట్రియల్ ఏరియా పార్క్ విలువ రూ.కోట్లలో ఉంటుంది. బాబూలాల్ గౌర్, తాను, శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పార్క్లో మొక్కలు నాటామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. కానీ దీన్ని కేవలం రూపాయికే చిన్న మధ్య తరహా పరిశ్రమ భారతికి కేటాయించారని ఆరోపించారు.
ఇండస్ట్రియల్ ఏరియాలోని వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఈ పార్క్లోనే మధ్యాహ్న భోజనం చేస్తారని గుర్తు చేశారు దిగ్వజయ్ సింగ్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నిరసనకు దిగారు.
నిరసనకారులపై వాటర్ కెనాన్లు ప్రయోగించారని, బ్రిటిష్ చట్టాలను ప్రయోగించారని ఆరోపించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ అణచివేత చర్యలకు కాంగ్రెస్ పార్టీ సభ్యులు భయపడబోరన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రదర్శనలు చేసే హక్కు ఉంటుందన్నారు.