న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఇచ్చిన భారత్ బంద్( Bharat Bandh ) పిలుపుతో గుర్గావ్-ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ బంద్ నేపథ్యంలో ఢిల్లీలోకి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్నంగా పరిశీలించి వదులుతున్నారు. దీంతో వందల సంఖ్యలో కార్లు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నాయి. 40 రైతు సంఘాలు భాగంగా ఉన్న సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిరసనలు చేపట్టనుంది. నేషనల్ హైవేలను దిగ్బంధిస్తామని హెచ్చరించింది. రైల్వే ట్రాక్లపైనా బైఠాయించడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా, వ్యాపార సంస్థలు మూసివేయాలని ఈ మోర్చా పిలుపునిచ్చింది. అత్యవసర సేవలను మాత్రం ఈ బంద్ నుంచి మినహాయించారు.