న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు వీరమరణం పొందిన రోజు ఇవాళ. 90వ వర్ధంతి సందర్భంగా రాజ్యసభలో చైర్మెన్ వెంకయ్య నాయుడు నివాళి అర్పించారు. ధైర్యసాహసాలకు, దేశభక్తికి.. ఆ ముగ్గురి పేర్లు ఇంటి పేర్లుగా మారినట్లు వెంకయ్య తెలిపారు. యావత్ దేశానికి ఆ ముగ్గురు యోధులు ప్రేరణగా నిలుస్తున్నారన్నారు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులకు నివాళిగా సభ్యులు నిమిషం పాటు మౌనం పాటించారు. లోక్సభలోనూ ఇవాళ ప్యానల్ స్పీకర్ కీర్తి సోలంకి నివాళి అర్పించారు. భగత్ సింగ్కు నివాళి అర్పిస్తూ ప్రకటన చేశారు. రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు.