సాధారణంగా బస్సుల్లో లేడీస్కు సపరేట్గా సీట్లు ఉంటాయి. వాళ్ల కోసం 30 శాతం లేదా 40 శాతం సీట్లను రిజర్వ్ చేస్తుంటారు. అయితే.. ఒకవేళ లేడీస్ లేకపోతే.. ఆ సీట్లలో ఇన్ని రోజు మగవాళ్లు కూడా కూర్చునేవారు. కొందరైతే.. లేడీస్ బస్సులో ఉన్నా.. లేడీస్ సీట్లలో దర్జాగా కూర్చుంటారు.
అటువంటి వాళ్లకు చెక్ పెట్టేందుకే.. ముంబైలోని BEST ఈ నిర్ణయం తీసుకుంది. ముంబైలో తిరిగే లోకల్ బస్సులో లేడీస్ కోసం రిజర్వ్ చేసిన సీట్లలో మగవాళ్లు కూర్చుంటే.. 500 రూపాయల ఫైన్ విధించనుంది. అలాగే… మహారాష్ట్ర మోటర్ వెహికిల్ రూల్స్ ప్రకారం.. మహిళల సీట్లలో కూర్చునే మగవాళ్లపై సెక్షన్ 102 కింద కేసు ఫైల్ చేయనున్నారు.
BEST కు మహిళా ప్యాసింజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మహిళల సీట్లలో కూర్చునే పురుషులకు కండక్టర్లే ఫైన్ వేయనున్నారు.