కోల్కతా: కరోనా మహమ్మారి మరణ మృదంగం కొనసాగుతున్నది. ఈ వైరస్ చిన్నాపెద్దా, బీదాబిక్కీ అనే తేడా లేకుండా అందరి ప్రాణాలు తీస్తున్నది. తాజాగా పశ్చిమబెంగాల్కు చెందిన ప్రముఖ కవి శంఖ ఘోష్ (89) కూడా కరోనా కాటుకు బలయ్యారు. శంఖ ఘోస్కు ఏప్రిల్ 14న కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన డాక్టర్ల సలహా మేరకు తన నివాసంలోనే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు.
పరిస్థితి మరింత విషమించడంతో ఈ ఉదయం ఘోష్ కన్నుమూశారు. బెంగాలీ సాహిత్యరంగంపై ఆయన చెరగని ముద్రవేశారు. సాహిత్యరంగంలో విశేష సేవలు అందించినందుకుగాను ఆయన ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2011లో పద్మభూషణ్, 2016 జ్ఞాన్పీఠ్ అవార్డు వరించింది. బాబరర్ ప్రార్థన అనే గ్రంథ రచనకుగాను 1977 సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఘోష్ హిందీ, ఇంగ్లిష్తోపాటు ఎన్నో భాషలకు సంబంధించిన పుస్తకాలను బెంగాళీలోకి అనువదించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్.. ఏ జైల్లోనో తెలుసా..?
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి పూజలు
ఈ నెల 30 వరకు బ్రిటన్కు విమాన సర్వీసులు బంద్ : ఎయిర్ ఇండియా
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
బెంగాల్లో B.1.618 వేరియంట్ దడ..