కోల్కతా: ప్రముఖ బెంగాలీ రచయిత బుద్ధదేవ్ గుహ (85) కన్నుమూశారు. కొవిడ్ అనంతర అనారోగ్య సమస్యలతో ప్రైవేటు దవాఖానలో చికిత్సపొందుతూ తీవ్ర గుండెపోటు కారణంగా ఆదివారం రాత్రి మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. బుద్దదేవ్ కాల్పనిక రచనలు తూర్పు భారత్లోని ప్రకృతి, అడవులతో ఆయనుకున్న సాన్నిహిత్యాన్ని ప్రతిబింబింపజేస్తాయి. ఆయన రచనల్లో మధుకరి, కోయిలర్ కచ్ఛే, సొబినోయ్ నిబేడన్ వంటివి ప్రధానమైనవి. గుహ రచనల నుంచే డిక్షనరీ అనే బెంగాలీ చిత్రాన్ని రూపొందించారు. గుహ మృతిపై ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ సంతాపం ప్రకటించారు.