ఖరగ్పూర్ : ఈసారి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ ఆయన ఖరగ్పూర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో సభకు జనం హాజరయ్యారని, దీన్ని గౌరవంగా భావిస్తానని అన్నారు. కాంగ్రెస్, లెఫ్టి పార్టీలు విధ్వంసం సృష్టించాయని, టీఎంసీ మీ ఆశల్ని చదిమేసిందని, గత 70 ఏళ్లుగా ప్రతి ఒక్కరికీ మీరు అవకాశం ఇచ్చారు, ఈసారి అయిదేళ్ల కోసం మాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రధాని మోదీ అన్నారు. మాకు పాలనను అందిస్తే, 70 ఏళ్ల విధ్వంసం నుంచి బెంగాల్ విముక్తి అవుతుందన్నారు. మా జీవితాలను మీకు త్యాగం చేస్తామన్నారు. వాట్సాప్, ఇన్స్టా, ఎఫ్బీలు ఓ గంట పాటు నిన్న పనిచేయలేదని, అప్పుడు అందరూ ఆందోళన చెందారని, కానీ బెంగాల్లో 55 ఏళ్ల నుంచి అభివృద్ధి జరగలేదన్నారు. మొదట కాంగ్రెస్, ఆ తర్వాత లెఫ్ట్, ఇప్పుడు టీఎంసీ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని టీఎంసీ అడ్డుకుంటోందన్నారు. టీఎంసీ సిండికేట్ వ్యవహారంల వల్ల రాష్ట్ర పరిశ్రమలు మూతపడ్డాయని, ఇక్కడ మాఫియా ఉద్యోగాలు మాత్రమే వర్ధిల్లుతున్నాయన్నారు.