ట్యూనిస్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ యూత్ స్టార్ కంటెండర్ టోర్నీ అండర్-19 బాలిక డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్లు దియా చాటాలే – స్వస్తిక ఘోష్ పతకాన్ని ఖాయం చేసుకున్నారు. భారత ద్వయానికి ఫస్ట్ రౌండ్లో బై ఎదురుకాగా.. ఆదివారం ఇక్కడ జరిగిన రెండో రౌండ్లో దియా-స్వస్తిక జంట 11-5, 6-11, 11-9, 11-8తో ట్యూనీసియా ప్లేయర్లు ఫద్వా గ్రేసి, మారమ్ జోగ్లామీ ద్వయంపై సునాయాసంగా గెలిచింది. దీంతో భారత జోడీ సెమీస్లో అడుగుపెట్టి కనీసం కాంస్య పతకాన్ని పక్కా చేసుకుంది. అలాగే వ్యక్తిగతంగా అండర్ -19 సింగిల్స్లో దియా, అండర్-16లో స్వస్తిక క్వార్టర్ ఫైనల్స్కు చేరారు.