న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైనా బెంగాల్ బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ రాష్ట్ర యువమోర్చా చీఫ్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో తనకు స్ధానం దక్కుతుందని ఆశించిన ఎంపీ ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ కోసం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ వేచిచూశారు.
అయితే కేంద్ర క్యాబినెట్లో తనకు చోటు లభించడం లేదని తెలుసుకున్న ఆయన బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రత్యేక జంగల్మహల్ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.