టీఎంసీలో చేరిన ఎంపీ బాబుల్ సుప్రియో
కోల్కతా, సెప్టెంబర్ 18: పశ్చిమబెంగాల్లో బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ, కేంద్రమాజీ మంత్రి బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ సమక్షంలో శనివారం టీఎంసీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సుప్రియో మాట్లాడుతూ తనను కేంద్రమంత్రి వర్గం నుంచి తప్పించినప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పానని, కానీ రాష్ర్టాభివృద్ధి కోసం తనవంతు కృషి చేయడానికి టీఎంసీలో చేరానని తెలిపారు. ఇప్పటికే ముకుల్రాయ్ సహా పలువురు బీజేపీ నేతలు టీఎంసీలో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు బాబుల్ సుప్రియోకు భద్రతను కేంద్రం తగ్గించింది. జడ్ క్యాటగిరీ నుంచి వై క్యాటగిరికి కుదించింది.