హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ దేశానికి స్మగ్లర్ వీరప్పన్లా దాపురించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆరోపించారు. స్మగ్లర్ వీరప్పన్ కేవలం కలపను మాత్రమే కొల్లగొడితే.. మోదీ మొత్తం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్యతో కలిసి గాదరి మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాదని, తొండి సంజయ్ అని విమర్శించారు. తానొక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడినిఅని, ఎంపీననే సోయిలేకుండామండలిని లిక్కర్ కౌన్సిల్గా అపహాస్యం చేయడంపై ధ్వజమెత్తారు.
ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని గాదరి ఆరోపించారు. ఐటీఐఆర్పై మంత్రి కేటీఆర్ కేంద్రానికి పదే పదే లేఖలు రాసినా పట్టించుకోకుండా.. రాష్ట్రం స్పందించకపోవటంతోనే ఐటీఐఆర్ రాలేదని బండి చెప్పడం అతని అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. ఇలానే మాట్లాడితే బండి కి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ప్రభుత్వ సంస్థలను అమ్మేసిన ప్రధానిగా మోదీ నిలిచిపోతారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నీ గుజరాత్కు చెందిన ఇద్దరు దొంగ (అంబానీ, ఆదానీ)లకు మోదీ దోచిపెడుతూ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ అవతారం ఎత్తారని మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న అనాలోచిత విధానాల వల్ల ఈ దేశ ఉత్పత్తిలో భాగస్వామ్యం కావాల్సిన యువత, సంపద విదేశాలకు తరలివెళుతుందని ఆవేనద వ్యక్తంచేశారు.కాజీపేటకు దక్కాల్సిన రైల్వే కోచ్ఫ్యాక్టరినీ కేంద్రం ఎత్తివేస్తే.. కాంగ్రెస్ నేత ఉత్తమ్కుమార్రెడ్డి తాము అధికారంలోకి వస్తే కోచ్ఫ్యాక్టరినీ తెస్తామని పేర్కొనటం విడ్డూరంగా ఉందని అన్నారు.