ముంబై, మార్చి 16: కర్ణాటకలోని బెళగావిలో మరాఠా భాష మాట్లాడే వారిపై దాడులు పెరుగుతున్నాయని, కాబట్టి ఆ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన డిమాండ్ చేసింది. మరాఠా మాట్లాడేవారే లక్ష్యంగా కొన్ని కన్నడ సంఘాలు దాడులకు పాల్పడుతున్నా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. ఈ మేరకు పార్టీ పత్రిక ‘సామ్నా’లో సంపాదకీయాన్ని ప్రచురించింది. కర్ణాటక పోలీసులు కూడా మరాఠీలను వేధిస్తున్నారని తెలిపింది.