తిరువనంతపురం : వచ్చే నెల 6 వ తేదీన జరుగనున్న కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలను టైమ్స్ నౌ ప్రకటించింది. కేరళలో ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తుండగా.. పుదుచ్చేరిలో ఎన్డీఏకు అధికారం దక్కుతుందని తమ సర్వేలో తేలినట్లు టైమ్స్ నౌ పేర్కొన్నది.
వీరి సర్వే ఫలితాల ప్రకారం.. కేరళలో ఎల్డీఎఫ్ 2016 ఎన్నికల్లో గెలిచిన సంఖ్య కంటే 14 సీట్లను కోల్పోయి 77 స్థానాల్లో విజయం సాధించనున్నది. ఎల్డీఎఫ్ ప్రధాన ప్రత్యర్థి అయిన యూడీఎఫ్ ఈసారి 62 నియోజకవర్గాల్లో గెలువనున్నది. గత ఎన్నికల్లో యూడీఎఫ్ 47 స్థానాల్లో గెలుపొందింది. కాగా, 2016 ఎన్నికల్లో ఒక సీటుకే పరిమితమైన బీజేపీ.. ఇప్పుడు కూడా ఒక్క స్థానంలోనే విజయం సాధించనున్నది.
ఓటు వాటా విషయానికొస్తే.. ఎల్డీఎఫ్ 42.4 శాతం పొందుతుందని అంచనా వేయబడింది. ఇది 2016 లో (43.5 శాతం) కంటే స్వల్పంగా తక్కువ. యూడీఎఫ్ గత ఎన్నికల్లో కంటే కొంచెం ఎక్కువగా 38.6 శాతం ఓట్లు పొందనున్నది. బీజేపీ 2016 లో పొందిన వాటాను ఈ ఎన్నికలలో 1.5 శాతం మేర మెరుగుపరుస్తుందని అంచనా వేశారు.
ఇతర పార్టీలు ఒకే సీటును గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, స్వతంత్రులు 2.6 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించరు. ఎల్డీఎఫ్ 71-83 మధ్య, యూడీఎఫ్ 56-68 మధ్య సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి.
కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ వైపే ప్రజలు మొగ్గు చూపినట్లు టైమ్స్ నౌ సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పినరయి విజయన్కు 39.3 శాతం, ఊమెన్ చాందీకి 26.5 శాతం, ముల్లపల్లి రామచంద్రన్కు 8.8 శాతం ఓట్లు దక్కాయి.
ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల సంతృప్తి లేదని 42.5 శాతం మంది పేర్కొనగా.. కొంత మేరకు సంతృప్తిగా ఉన్నామని 32.58 శాతం, చాలా సంతృప్తిగా ఉన్నామని 23.88 శాతం మంది పేర్కొన్నారు.
కేరళ ముఖ్యమంత్రి పనితీరు చాలా సంతృప్తికరంగా ఉన్నట్లు 44.72 శాతం మంది తెలిపారు. కాగా, కొంత మేరకు సంతృప్తిగా ఉన్నామని 32.92 శాతం మంది, సంతృప్తికరంగా లేమని 21.93 శాతం మంది వెల్లడించారు.
రాహుల్గాంధీ పనితీరుపై సంతృప్తికరంగా లేమని 33.32 శాతం తెలుపగా.. చాలా సంతృప్తిగా ఉన్నామని 31.32 శాతం మంది, కొంత మేర సంతృప్తిగా ఉన్నామని 29.94 శాతం మంది పేర్కొన్నారు.
పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెల 6 న జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీఏ పూర్తి ఆధిక్యం ప్రదర్శించనున్నదని టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్ తెలిపింది. ఇక్కడ 30 స్థానాలకు గాను ఎన్డీఏకు 21 సీట్లు లభించున్నాయి.
కాగా, యూపీఏకు 9 సీట్లు దక్కనున్నాయి. స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలిచే అవకాశాలు ఉన్నాయి. 2016 ఎన్నికల్లో ఎన్డీఏకు 16.7 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. కాగా, ఎన్డీఏ 47.2 శాతం ఓట్లను పొందుతుండగా.. యూపీఏకు గత ఎన్నికల్లో మాదిరిగా 39.5 శాతం ఓట్లు లభించనున్నాయి.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్ రంగస్వామి సరైన వ్యక్తి అని సర్వేలో ప్రజలు తేల్చారు. రంగస్వామికి 49.8 శాతం మంది ప్రాధాన్యత ఇవ్వగా.. వీ నారాయణస్వామికి 20 శాతం, ఇతరులకు 30.2 శాతం మంది జైకొట్టారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల 38.6 శాతం మంది సంతృప్తిగా లేమని తెలుపగా.. కొంత మేర సంతృప్తిగా ఉన్నామని 32.73 శాతం మంది, చాలా సంతృప్తిగా ఉన్నామని 20.35 శాతం మంది పేర్కొన్నారు.
పుదుచ్చేరిలో గత ప్రభుత్వం పనితీరు విషయంలో 45.16 శాతం మంది సంతృప్తిగా లేమని చెప్పగా.. కొంతమేర సంతృప్తి చెందామని 24.76 శాతం మంది, చాలా సంతృప్తిగా ఉన్నామని 15.42 శాతం మంది వెల్లడించారు.
ఇక్కడి ఓటర్లు రాహుల్గాంధీ పనితీరు పట్ల సంతృప్తిగా లేమని 32.67 శాతం మంది చెప్పగా.. చాలా బాగుందని 18.72 శాతం మంది తెలిపారు.
నల్ల ద్రాక్షతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ ఆర్-ఫ్యాక్టర్
బెంగాల్ ఎన్నికలకు యూపీ పోలీసులు.. ఈసీకి టీఎంసీ లేఖ
బిట్ కాయిన్తో టెస్లా కారు కొనొచ్చు.. ఎలోన్ మస్క్ ట్వీట్
త్వరలో క్యాన్సర్ వ్యాధికి టీకా.. జర్మన్ శాస్త్రవేత్త దంపతుల దృష్టి
పరంబీర్ పిటిషన్ విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
క్షయవ్యాధికి కారకాన్ని గుర్తించిన రాబర్ట్ కోచ్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..