తిరువనంతపురం: పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాద ఘటన కేరళలోని కన్నూరు జిల్లా కుతుపరంబాలో జరిగింది. గతేడాది సెప్టెంబర్లో ఓ మహిళ ఉద్యోగి (38) ప్రమోషన్పై త్రిస్సుర్ నుంచి కొతుపరంబాలోని తొక్కిలంగడి బ్రాంచ్కు మేనేజర్గా వచ్చింది. ఈ క్రమంలో పని ఒత్తిడిని తట్టుకోలేక శనివారం బలవన్మరణానికి పాల్పడింది.
రోజువారీ విధుల్లో భాగంగా ఓ మహిళా ఉద్యోగి బ్యాంకుకు వచ్చింది. అయితే మేనేజర్ తన గదిలో ఉరివేసుకుని కనిపించడంతో గట్టిగా కేకలు వేసింది. దీంతో తోటి ఉద్యోగులు, స్థానికులు ఆ మేనేజర్ను దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ లభించిన డైరీని స్వాధీనం చేసుకున్నారు. పనిఒత్తిడిని తట్టు్కోలేకపోతున్నానని, దీంతో ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అందులో పేర్కొన్నది. ఆమెకు 15, 13 ఏండ్ల వయస్సు కలిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..