హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు ఎంపికైన యువ షట్లర్ సాయిప్రణీత్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. మంగళవారం రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ప్రణీత్కు రూ.5లక్షల చెక్కును రాష్ర్ట క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.