సీఎం కేసీఆర్, మంత్రులు సంతాపం
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): సీనియర్ పాత్రికేయుడు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు కోసూరి అమర్నాథ్ (70) ఇకలేరు. కరోనా బారిన పడి హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మొదలుపెట్టి ఎడిటర్ స్థాయికి ఎదిగిన అమర్నాథ్ మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర్నాథ్ మరణంపై మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, దయాకర్రావు, ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంతాపం తెలిపారు. మూడు దశాబ్దాలకుపైగా జర్నలిజంలో ఆయన తనదైన ముద్ర వేశారని వారు పేర్కొన్నారు. ఇండియన్ జర్నలిస్టు యూనియన్, అఫీషియల్ జర్నలిస్టు సబ్ కమిటీ, వివిధ జర్నలిస్టు సంఘాలు, పలు పార్టీలు కూడా అమర్నాథ్ మృతికి సంతాపం ప్రకటించాయి.